Sunday, May 5, 2024

AP : పోటీకి దూరం … ఎంపి మాగుంట‌

త్వరలో టిడిపిలో చేరతానని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. ఒంగోలులో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో చర్చించి చేరిక తేదీని నిర్ణయిస్తామన్నారు.

- Advertisement -

తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పానన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టిడిపి-జనసేన-భాజపా కలిసి పనిచేయడం శుభపరిణామమని చెప్పారు. ఇది ఇలా ఉంటూ మాగుంట ఇటీవ‌ల వైసిపి కి రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement