Friday, May 3, 2024

అసంతృప్తి: తిరుప‌తి కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి రాజీనామా

తిరుపతి (ప్ర‌భ న్యూస్‌): తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి మంత్ర‌వ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో తిరుప‌తిలో చాలామంది లీడ‌ర్లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికి నిర‌స‌న‌గా తిరుప‌తి కార్పొరేష‌న్ కో ఆప్ష‌న్ స‌భ్యురాలు రుద్ర‌రాజు శ్రీ‌దేవి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు త‌న రాజీనామా ప‌త్రాన్ని సోమ‌వారం తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌కు అంద‌జేయ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా, దివంగ‌త రాజారెడ్డితో సాంగ‌త్యంతో పాటు.. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి త‌న‌వంతు పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు.

పార్టీకోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేసి, సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుటుంబానికి అండ‌దండ‌గా ఉన్నార‌ని, అట్లాంటి వ్య‌క్తికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీకి కష్టపడిన వ్య‌క్తిగా.. పార్టీనే నమ్ముకున్న ఎమ్మెల్యే భూమనకు మంత్రి పదవి ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురై తాను రాజీనామా చేస్తున్నట్లు శ్రీ‌దేవి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement