Wednesday, May 15, 2024

అసంతృప్తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఖాదీ బోర్డు డైరెక్ట్ బాబు రాజీనామా

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఖాదీ బోర్డు డైరెక్టర్ దుద్దెల బాబు ఆదివారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి పదవి ద‌క్క‌క‌పోవ‌డం.. ఆయ‌న‌కు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మనస్థాపం చెంది తాను రాజీనామా చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి కేబినెట్‌లో చోటు కల్పించక‌పోవ‌డం పట్ల మనస్థాపం చెందిన‌ట్టు తెలిపారు. అందుకే తన ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement