Sunday, April 28, 2024

మ‌హా పాద‌యాత్ర‌లో అప‌శృతి

ప్రకాశం జిల్లా కొండపి మండలం ఉప్పలపాడు రైతు మహా పాదయాత్రలో 15వరోజు అపశృతి చోటు చేసుకుంది. అమరావతి రైతు మహా పాదయాత్రకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఘన స్వాగతం పలికేందుకు జరుగుమల్లి మండలం చటుకుపాడు రైతులు వ‌చ్చారు. పెద్ద పెద్ద బెలూన్స్ ఏర్పాటు చేసే తరుణంలో బెలూన్స్ కి గాలి ఎక్కుతుండగా సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయ‌ప‌డ్డ వారిని కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement