Tuesday, May 7, 2024

సీఎం జగన్ ని కలిసిన ..దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఏపీ సీఎం జగన్ ని కలిశారు. జగన్ నివాసానికి వెళ్లిన ఆర్జీవీ ఆయనతో భేటీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మను ముఖ్యమంత్రి జగన్ విందుకు ఆహ్వానించారు. దాదాపు గంటన్నర పాటు ఇరువురు సమావేశం కొనసాగింది. జగన్ తో కలిసి భోజనం చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ భేటీలో వారు తెలుగు సినీ పరిశ్రమ, కార్మికులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement