Saturday, May 4, 2024

Srisailam: నల్లమలలో గుండెపోటుతో భక్తుడు మృతి        

ఉగాది పర్వదినాన్నిపురష్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన బయలుదేరిన కన్నడ భక్తుడు గంటా నరేష్(25) నల్లమల అటవీ ప్రాంతంలోనినాగలూటి పంగిడి బేస్ క్యాంపు సమీపంలో గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా హోసూరుకు చెందిన గంటా నరేష్ బస్సులో ప్రయాణించి బుధవారం సాయంత్రం వెంకటాపురం గ్రామానికి చేరుకొని అక్కడ నుంచి కాలినడకన శ్రీగిరి చెంతకు బయలుదేరారు. అయితే గురువారం నాగలూటి అటవి రేంజ్ దాటి పంగిడి బేస్ క్యాంపు సమీపానికి చేరుకోగానే హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే మృతి చెందడంతో అటవీశాఖ అధికారులు మృతదేహన్ని తరలించారు. ఎస్ఐ వరప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య మల్లిక ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు  తమ  బంధువులకి అప్పగించి వాళ్ల స్వగృహానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement