Sunday, May 19, 2024

AP: పేదలకు అన్నం పెట్టే అన్నాక్యాంటిన్‌ ధ్వంసం చేయడం దారుణం.. టీడీపీ అధినేత‌ చంద్రబాబు

కుప్పం, (చిత్తూరు) ప్రభ న్యూస్‌ : కుప్పం చరిత్రలో ఇదొక బ్లాక్‌ డే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు అన్నా క్యాంటీన్‌ వద్ద మాట్లాడారు. కుప్పం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి అక్కడే భోజనం చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ కార్యర్తలను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దీనికి ముందు కుప్పంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం నీచమన్నారు. వీధికొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారన్నారు.

పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్నా క్యాంటీన్‌ ను ఇలా ధ్వంసం చేసేవారా అని ప్ర‌శ్నించారు. ఎస్పీ ఎక్కడ ఉన్నారు… ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్నారు. పక్కనే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నా దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. అన్నా క్యాంటీన్‌ పై దాడి చేసిన వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా? మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్‌ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నాం…. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నాం…. మూడేళ్లలో అనేక చోట్ల నా పర్యటనలకు అడ్డంకులు సృష్టించారు. కోర్టు కూడా చీవాట్లు పెట్టింది… అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది… తమ ఇంటికి వచ్చిన రౌడీలకు ప్రమోషన్‌ ఇచ్చి జగన్‌ మంత్రులను చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి దాడులకు టీడీపీ భయపడేది లేదన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తను ప్రజలకు, మీడియాకు చూపించి ప్రశ్నించారు టీ-డీపీ అధినేత. వైసీపీ, పోలీసులపై న్యాయ పరంగా పోరాడుతా…రాజకీయంగా కూడా పోరాడుతానన్నారు. కొందరు. పోలీసుల కంటే బ్రిటిష్‌ వాళ్లే నయమనిపించిందన్నారు. వైసీపీ పతనం నేటి నుంచి ప్రారంభమైందన్నారు. కుప్పం నుంచి ధర్మపోరాటానికి నాంది అన్నారు. కుప్పంలో నేడు సిగ్గు లేకుండా ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు…స్కూళ్లు మూసి వేశారు. ఏంటి ఇవన్నీ? అని ప్రశ్నించారు. తన శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా వెళ్లాల్సిన అవసరం ఉందని… అందుకే ఇలా మట్లాడాల్సి వస్తున్నదన్నారు. ఎక్కువ కాలం తమ కార్యకర్తలను కట్టడి చెయ్యడం కూడా సాధ్యం కాదన్నారు. వైసీపీ వాళ్లు కూల్చిన దగ్గరే అన్నా క్యాంటీ-న్‌ లో భోజనం పెడుతున్నానన్నారు. ఈ సారి తమపై దాడి జరిగితే….వాళ్ల ఇంటికి వెళ్లి కొడతామన్నారు. అన్నా క్యాంటీ-న్‌ ఇక్కడే కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement