Monday, April 29, 2024

Derailed – ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ – విశాఖ-కిరండోల్‌ నైట్‌ ఎక్స్‌ ప్రెస్ ర‌ద్దు..

ఎస్‌.కోట: విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం బొడ్డవర వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజంతో కిరండోల్‌ నుంచి విశాఖ వస్తుండగా గూడ్స్‌ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఎం, రైల్వే అధికారులు ఘటనా స్థలికి బయల్దేరారు.

ఐర‌న్ ఓర్ తో ఉన్న గూడ్స్ బోగీలను ట్రాక్ మీద నుంచి త‌ప్పించే ప‌నిని సిబ్బంది ప్రారంభించారు.. సింగిల్ లైన్ రూట్ లో ప్ర‌మాదం జ‌ర‌గడంతో విశాఖ నుంచి బయల్దేరే విశాఖ-కిరండోల్‌ నైట్‌ ఎక్స్‌ ప్రెస్‌ను రైల్వే అధికారులు రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement