Monday, April 29, 2024

AP | కృష్ణా జిల్లాలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

కృష్ణా జిల్లాలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ అయిన కేసు న‌మోదైంది. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో ఈ ఘ‌ట‌న నిన్న (శ‌నివారం) రాత్రి జ‌రిగింది. ఉల్లిపాలెం భవానీపురం వారిదిపై విద్యార్థిని సైకిల్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. డిగ్రీ విద్యార్థి అదృశ్యమైన సంఘటన కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని 7వ‌వార్డులో చోటుచేసుకుంది. కోడూరు గ్రామానికి చెందిన పరిశే శ్రీనివాసరావు కుమార్తె పరిశే కృపా (18) శనివారం రాత్రి 10 గంటల సమయంలో వేరే గ్రామంలో ఆదివారం జరుగే ప్రత్యేక ప్రార్థనలకు వెళతానని ఇంట్లో చెప్పి వెళ్లింది.

తల్లిదండ్రులు దీనికి నిరాకరించడంతో మనస్థాపానికి గురై కోపంగా తన సైకిల్ ని తీసుకొని బయటికి వెళ్లిపోయినట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తునట్లు కోడూరు ఎస్సై వి రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థిని సైకిల్ ఉల్లిపాలెం భవానీపురం వారిదిపై క‌నిపించింద‌ని, అమ్మాయి కోసం వెతుకుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement