Wednesday, May 1, 2024

TS | చేప‌ల వేట‌కు వెళ్లి.. మేడికుంట వాగులో మునిగి వ్యక్తి మృతి

వాజేడు (ప్రభ న్యూస్): ములుగు జిల్లా వాజేడులో ఓ వ్య‌క్తి నీట మునిగి చ‌నిపోయిన ఘ‌ట‌న జ‌రిగింది. వాజేడు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన మడే జానకయ్య (53) మేడికుంట వాగులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. జానకయ్య మృతదేహాన్ని గ్రామస్తులు వెలికి తీశారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. కుటుంబ పెద్దదిక్కు చ‌నిపోవ‌డంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement