Saturday, May 4, 2024

పొత్తులు ఉంటాయి..ఎవ‌రితో అనేది అధిష్టానం నిర్ణ‌యిస్తుంది – పురంధేశ్వ‌రి

అమరావతి: ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి చెప్పారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి ఆమె స్పష్టం చేశారు. గన్న‌వ‌రంలో నేడు జ‌రిగిన రాష్ట్ర స్థాయి బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను జాతీయ నాయకులకు వివరిస్తున్నామన్నారు. పార్టీ అంతర్గత చర్చలను మీడియాకు తాను చెప్పలేనన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందన్నారు. అన్ని రంగాల్లో వైసీపీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. జగన్ సర్కార్ పై చార్జీషీట్లు నిర్వహిస్తున్న విషయాన్ని పురంధేశ్వరి తెలిపారు. గ్రామం నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ అవినీతిపై చార్జీషీట్ విడుదల చేస్తున్నామన్నారు.జగన్ సర్కార్ పై ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదనేది వాస్తవమన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement