Thursday, May 2, 2024

IND VS PAK: జోరుగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, విశాఖలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావంతో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ దగ్గర నుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరంలో మరికొంతమంది ఉన్నట్లుగా పోలీసులు  అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన బుకిలను పట్టుకొని పనిలో ఉన్నారు ప్రత్యేక పోలీసు బృందాలు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 15 మంది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement