Sunday, April 28, 2024

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 215 మందికి కోవిడ్

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,831 సాంపిల్స్ ని పరీక్షించగా.. 215 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ తో కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. అదే సమయంలో 406 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతతం 3,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 20,67,921కి చేరగా.. ఇందులో 20,49,961 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,392 మంది కరోనాతో మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement