ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తుండడంతో ఏపీలోనూ తగ్గించాలన్న డిమాండ్ వస్తోంది. విపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ స్పందించారు. పెట్రో ధరలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయం తీసుకుంటామని కృష్ణదాస్ అన్నారు.
పెట్రో ధరలపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చమురుపై పన్నులు తగ్గించడంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెట్రో ధరలపై ఏపీ, తెలంగాణ తమ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.