Saturday, May 4, 2024

AP: గన్నవరం సబ్ జైల్​లో కరోనా కలకలం.. రిమాండ్​ ఖైదీకి నిర్ధారణ

కృష్ణా జిల్లాలోని గన్నవరం సబ్​ జైలులో కరోనా కలకలం చెలరేగింది. సబ్ జైల్లో దాదాపు 18మంది ఖైదీలుండగా, 30 మంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఒక చోరీ కేసులో రిమాండ్ విధించిన ఖైదీకి కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. కరోనా సోకిన వ్యక్తి పేరు సిరిగిరి చంద్రశేఖర్ గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందించనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement