Saturday, May 4, 2024

ఏపీలో ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 1,178 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,970 సాంపిల్స్ ని పరీక్షించగా.. 1,178 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది మరణించారు. మొత్తం 1,266 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. చిత్తూరు జిల్లాలో 204, నెల్లూరు జిల్లాలో 177, కృష్ణా జిల్లాలో 151, గుంటూరు జిల్లాలో 135 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2023242కి చేరింది. ఇందులో 19,94855 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14,452 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు మొత్తం 13,935 మంది వైరస్ కు బలైయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,70,37,651 సాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: కేరళలో నిపా వైరస్.. 48 మందికి హై రిస్క్

Advertisement

తాజా వార్తలు

Advertisement