Saturday, April 20, 2024

ఈనెల 17న తెలంగాణలో అమిత్‌షా పర్యటన

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయత్రకు బ్రేక్ పడనుంది. సంజయ్ పాదయాత్ర ఇప్పటికే 100 కిలోమీటర్లు దాటింది. ఈ నెల 17వ తేదీ నాటికి ఆయన పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పాదయాత్రకు ఆయన బ్రేక్ ఇవ్వనున్నారు.

పాదయాత్రకు విరామం ఇచ్చిన అనంతరం బండి సంజయ్ నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన సభకు వెళ్లనున్నారు. మరోవైపు నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి దగ్గ బహిరంగసభను నిర్వహించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. అమిత్ షా పర్యటన సందర్భంగా పాదయాత్ర విశేషాలను ఆయనకు బండి సంజయ్ వివరించనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై కూడా అమిత్ షాతో బండి సంజయ్ చర్చించనున్నారు.ela

Advertisement

తాజా వార్తలు

Advertisement