Tuesday, April 30, 2024

AP : విశాఖ‌లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

విశాఖపట్నంలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్‌రావు ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐవోబీ బ్యాంకులో గన్‌మెన్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

ఉదయం 5 గంటలకు విధులకు హాజరైన శంకర్‌రావు.. తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌తో కాల్చుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారాకానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement