Wednesday, May 8, 2024

AP | శ్మశాన స్థలం కోసం ఆందోళన.. శవంతో రోడ్డుపై ధర్నా

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్): తిరుపతి – కరకంబాడి మార్గంలోనీ తిమ్మినాయుడు పాలెం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్మశానికి స్థలం కావాలని రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామానికి చెందిన అగరం నేలమ్మ సోమవారం రాత్రి చనిపోయింది. దీంతో ఆమె డెడ్​బాడీతో కొంతమంది ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్​ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement