Friday, April 26, 2024

రూ.2వేల నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బంది లేదు… సోము వీర్రాజు

రూ.2 వేల నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… చార్జ్ షీట్ కార్యక్రమంలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని సోము వీర్రాజు తెలిపారు. గ్రామాల్లో వైసీపీ సర్పంచ్‌లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడారని ఆరోపించారు. 6 నెలలుగా రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునివ్వడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement