Sunday, April 28, 2024

రేపు జూపాడుబంగ్లాకు సీఎం రాక‌.. చంద్ర‌మౌళిరెడ్డి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనున్న జ‌గ‌న్‌

నందికొట్కూరు, (ప్రభ న్యూస్) : ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లాకు రానున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి (28) అంత్యక్రియల్లో సీఎం పాల్గొన‌నున్నారు. టీటీడీ ఈ ఓ ధర్మారెడ్డి స్వగ్రామమైన నందికొట్కూరు నియోజకవర్గంంలోని పారుమంచాల గ్రామంలో గురువారం అంతిమ సంస్కారాలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, సీఎం రాక సంద‌ర్భంగా కలెక్టర్ మనజీర్ జిలానీ సామున్, ఎస్ పి రఘువీరారెడ్డి, జాయింట్ కలెక్టర్ లు బుధవారం రాత్రి పారుమంచాల గ్రామానికి వ‌చ్చిహెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement