Tuesday, May 7, 2024

ఏపీలో భారీ స్కామ్.. సీఎంఆర్ఎఫ్ నిధులు గోలమాల్..

ఏపీ సచివాలయంలో భారీ స్కామ్‌ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్‌మాల్‌ గుట్టును ఏసీబీ రట్టు చేసింది. పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ఈ భారీ స్కామ్‌లో 50 మంది ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. కేసులో పలువురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది.

2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఏసీబీ గుర్తించింది. తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో నిధులు నొక్కేసినట్లు తేల్చారు. సీ అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీసీఎంఆర్ఎఫ్‌లో సబార్డినేట్లగా పనిచేస్తున్న చదలవాడ సుబ్రహ్మణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి:Big Boss5: ఈ వారం నామినేషన్ లోకి వచ్చిందెవరంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement