Monday, April 15, 2024

టీటీడీలో ఎన్నో లొసుగులున్నాయ్: RRR

టీటీడీ బోర్డు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. హైకోర్టు నిర్ణయం మంచి పరిణామమని అని ఆయన అన్నారు. టీటీడీలో ఎన్నో లొసుగులు ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఈ కేసు రాబోయే రోజుల్లో కొట్టివేయ బడుతుందనే దాంట్లో అనుమానం లేదన్నారు. కేసుల వెనుక ఎటువంటి కుట్రలు లేవని, భక్తుల మనోభావాలను కాపాడడం కోసమే కేసు వేశారన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కి తగిన నిధులు లేవని, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో ఎవరిని నియమించకుండా వ్యాపారాలు చేసుకునే వారిని నియమిస్తున్నారని విమర్శించారు. టీటీడీ జాయింట్ ఈవో పోస్ట్ రాజ్యాంగ ప్రకారం ఉందన్నారు. కానీ అదనపు ఈవో పోస్టు లేదన్నారు. సీఎం ఏ విధంగా టీటీడీ అదనపు ఈవోను నియమిస్తారని రఘురామ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఆ జీవో సస్పెండ్‌ చేసిన హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement