Sunday, April 28, 2024

Breaking: రేపు కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ కు రానున్నారు. రేపు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి పరామర్శించనున్నారు. కేసీఆర్ మాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

అయితే కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ పార్టీల నాయకులు కేసీఆర్ ను పరామర్శించారు. అయితే ఏపీ సీఎం జగన్ రేపు కేసీఆర్ ను పరామర్శించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement