Sunday, April 28, 2024

ఈ-స్టాంపింగ్‌ సేవలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్ సేవ‌లు ఇక సుల‌భ‌త‌ర‌మ‌య్యాయి. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి శుక్రవారం వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. అనంతరం దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ”ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది. shcilestamp.com వెబ్‌సైట్‌ ద్వారా ఈ-స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ-స్టాంపులు ఆన్‌లైన్‌లో ధృవీకరించుకోవచ్చు. నగదు, చెక్కు, ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు” అని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement