Thursday, May 2, 2024

కావ‌లికి వ‌రాల జ‌ల్లు కురిపించిన సీఎం జ‌గ‌న్

రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా.. కావలికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.35కోట్లతో కావలి చెరువును రిజర్వాయర్ గా మార్చుట కోసం నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. 8వేల ఎకరాలు డెల్టాగా మార్చే సంగం బ్యారేజి నుండి లింక్ కెనాల్ కోసం 20 కోట్లు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కావలిలో ట్రంక్ రోడ్డు కోసం రూ.56 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా మరో రూ.14 కోట్లు అవసరమ‌వువుతాయని చెప్పారని అది కూడా మంజూరు చేస్తామ‌న్నారు. అలాగే 16వ వార్డులో వైఎస్ఆర్ కట్టించిన కాలనీలో జగనన్న కాలనీ లాగా రోడ్లు, డ్రెయిన్లు, కరెంటు, మిగతా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.80 కోట్లు అవసరమ‌వుతాయని చెప్పారు. ఆ రూ.80 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement