Saturday, April 27, 2024

పెద్దమ్మాకు సెల్ ఫోన్.. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్న ఓ మహిళ.. తాజాగా ఓ కొత్త సెల్‌ఫోన్‌ అందింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ డిసెంబర్ 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు జగన్‌తో సెల్ఫీ దిగేందుకు ముందుకు దూసుకువచ్చారు.

ఈ క్రమంలో తూకివాకం విజయ సెల్‌ఫోన్‌ జారి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ‘పెద్దమ్మా, మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది. బాధపడవద్దు’ అని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష కొత్త సెల్‌ఫోన్‌ను డాక్టర్‌ రవికాంత్‌ ద్వారా ఆమెకు అందజేశారు. దీంతో విజ‌య సంతోషం వ్యక్తం చేశారు. త‌న‌ను ఓదార్చడానికి సీఎం జగన్ అలా చెప్పారనుకున్నాన‌ని అన్నారు. అయితే, నిజంగానే ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని  సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement