Friday, March 29, 2024

ఏపీ మంత్రి సురేష్ కాన్వాయ్ కారు ఢీకొని ఒక‌రు మృతి

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్ కారు ఢీకొని ఒక‌రు మృతిచెందిన ఘ‌ట‌న ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్య‌క్తి చ‌నిపోగా.. మృతుని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్(38) అనే వ్యక్తి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా… అతని భార్య‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే.. అక్క‌డే ఉన్న స్థానికులు అత‌ని భార్య‌ను ఆస్ప‌త్రి కి త‌రలించారు. ఇక ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు.. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement