Friday, April 26, 2024

గులాబ్ తుఫాన్ బాధితులకు 5 లక్షల పరిహారం: సీఎం

గులాబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున, సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం అంచనా వేసి రైతులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement