Wednesday, May 15, 2024

బ్ర‌హ్మోత్స‌వాల‌పై టీటీడీ స‌మీక్ష‌

తిరుమల : తిరుమ‌ల‌లో నిర్వ‌హించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుపై జిల్లా యంత్రాంగంతో ఈవో ధ‌ర్మారెడ్డి సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో బ్రహ్మోత్సవాల నేఫధ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్వదర్శన భక్తులుకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్న‌ట్లు ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. సెప్టంబర్ 27వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్ర్తాలు సమర్పిస్తార‌ని, అక్టోబర్ 1వ తేదీన గరుడ వాహనం, 5వ తేదీన చక్రస్నానం కార్యక్రమం ఉంటుంద‌న్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తామ‌న్నారు. అక్టోబర్ 1వ తేదీన గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమ‌తించ‌బోమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement