Thursday, April 25, 2024

చిత్తూరు జిల్లాలో విషాదం… పెండ్లి ట్రాక్టర్‌ బోల్తా.. ఆరుగురు మృతి..

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండ‌లంలోని లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడ‌డంతో ఆరుగురు మృతిచెంద‌గా.. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను తిరుపతి స్విమ్స్‌, వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 26 మంది ఉన్నారని చెప్పారు. వారంతా జెట్టిపల్లి పెండ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement