Thursday, May 2, 2024

మాస్క్ లేదంటే మూల్యం చెల్లించక తప్పదు – ఎస్ఐ సంజీవ్ కుమార్

శ్రీకాళహస్తి కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశాలు లేకపోలేదని వన్ టౌన్ ఎస్ఐ సంజీవ్ కుమార్ పేర్కొన్నారు .కరోనా వైరస్ వల్ల గడిచిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు గురువారం బి పి అగ్రహారం కూడలి వద్ద ద్విచక్ర వాహనదారులు మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా మార్కులు వాడాలని హెచ్చరించారు. లేదంటే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ జనార్దన్ నాయుడు, చక్రవర్తి , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement