Friday, April 19, 2024

వ్యక్తి అదృశ్యం..

కుత్బుల్లాపూర్‌ : వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీసులు తన భార్య వల్లపు మీనాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. వల్లపు శ్రీను బిల్డిండ్‌ మెటీరియల్‌ చేస్తూ కట్టమైసమ్మనగర్‌ దేవేందర్‌నగర్‌ జగద్గిరిగుట్టలో జీవన సాగిస్తున్నాడు. ఈ నెల 15 న ఇంటి నుండి బయలుదేరి ఇంతవరకు తిరిగిరాలేదు. తెలిసిన చోట బంధువుల దగ్గర విచారించిన ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన అతని భార్య మీనాక్షి జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement