Friday, April 26, 2024

కేసులు, అరెస్టులతో భయపడేది లేదు : రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ

తిరుపతి సిటీ : కేసులో, అరెస్టులతో భయపడేది లేదని రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బేతం రాజు శ్రీధర్ వర్మ తెలిపారు. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా ఆయనను అరెస్టు చేసి మామండూరు గెస్ట్ హౌస్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం పార్టీకి చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేయడంతో పాటు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్ చార్జి సుగుణమ్మను పాటు పలువురు నాయకులను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.

అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పైన ఎస్టీ కేసులు నమోదు చేయడంతో పాటు కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలు ప్రజాసంబద్ధంగా నిర్వహించలేదని తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి, నియోజకవర్గాలకు సంబంధించి కొంత మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement