Wednesday, May 15, 2024

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి సిటీ : మనస్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. అలిపిరి ఎస్సై నరసింహ రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళంలో కాపురం ఉంటున్న రవి (50) సంవత్సరాలు మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. మద్యంకు బానిసై సంపాదించిన డబ్బులను ఇంట్లో ఇవ్వకపోవడంతో భార్య నీలా భర్తతో గొడవ పడుతూ ఉండేది. దీంతో ఆయన ఎక్కువగా మద్యం సేవించి ఇంటికి వచ్చి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement