Sunday, April 28, 2024

ఆంధ్రప్రభ వార్త‌కు స్పంద‌న‌.. స్టార్ట‌ర్ వ‌ర్క్ కంప్లీట్‌..

బంగారుపాళ్యం (ప్రభ న్యూస్): బంగారుపాళ్యం మండలం పరిధిలోని మొగిలి పంచాయతీలో రెండు నెలలుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వార్త ఆదివారం ఆంధ్ర ప్రభ దినపత్రిక లొ రావడంతో అధికారులు స్పందించారు. స్టార్ట‌ర్ రిపేరులో ఉండ‌డంతో దాన్ని స‌రిచేశారు. గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు.

నీరు వదలడానికి ఎవరూ లేక సమస్య ఏర్పడుతోంద‌ని, అధికారులు స్పందించి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసి శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుచున్నారు. ప్రస్తుతానికి సమస్య పరిష్కరించినందుకు రాజేంద్ర నాయుడు, జనసేన నాయకుడు ప్రశాంత్ కు గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement