Thursday, May 2, 2024

భారీ చోరీ : బంగారు, వెండి, నగదు మాయం

తిరుపతి సిటీ : అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో ఉన్న నవోదయ కాలనీలో భారీగా ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం బాధితుడు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి అలిపిరి క్రైమ్ పోలీసులు వెళ్లి వేలిముద్ర సేకరించారు. వివరాల్లోకి వెళితే… అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సుబ్బారెడ్డి నగర్ నవోదయ కాలనీలో కాపురముంటున్న మైన్స్ వ్యాపారి ఆర్.గుణశేఖర్ భార్యభర్తలిద్దరూ 10 రోజుల క్రితం అనంతపురంకు వెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు శుభకార్యానికి వెళ్లారు. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన దంపతులు తాళాలు తీసి తలుపులు తెరిచి చూడడంతో ఇంట్లో ఉన్న గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 350 గ్రాముల బంగారు మూడు కేజీలు వెండి. లక్షా నలభై రూపాయలు నగదు, పట్టు చీరలు తీసుకుని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేలిముద్ర సేకరించి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను అలిపిరి పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement