Thursday, April 18, 2024

Breaking: వాహనదారులకు శుభవార్త.. పెండింగ్​ చలానాలో 75శాతం మాఫీ..

వాహ‌నాల‌పై ఉన్న పెండింగ్ చ‌లాన్ల‌ను క్లియ‌ర్ చేసుకునేందుకు పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించ‌నుంది. దీని కోసం మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు పోలీసు శాఖ తెలిపింది. అంతేకాకుండా పాత చ‌లాన్ల‌ను క్లియ‌ర్ చేసుకునే క్ర‌మంలో డిస్కౌంట్ కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిపారు అధికారులు. టు వీల‌ర్ వాహ‌న‌దారుల పెండింగ్ చ‌లానా కోసం 25శాతం వ‌ర‌కు చెల్లింపున‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. మిగ‌తా 75శాతాన్ని మాఫీ చేయ‌బోతున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.


అదేవిధంగా కార్ల‌కు 50శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 30శాతం, తోపుడు బండ్ల‌కు 20శాతం వ‌ర‌కు చెల్లింపున‌కు చాన్స్ క‌ల్పిస్తున్నారు. ఈ మేర‌కు ఆన్‌లైన్‌, మే సేవా సెంట‌ర్ల‌లోని గేట్‌వేల ద్వారా చెల్లింపులు జ‌ర‌వ‌చ్చ‌ని పోలీసు శాఖ తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్న‌ట్టు ఈ మేర‌కు అధికారులు తెలిపారు. కాగా, పెండింగ్ చ‌లాన్లు క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదనను పోలీసు శాఖ అధికారులు తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement