Saturday, May 4, 2024

వృద్ధురాలిపై అత్యాచారం వ్యక్తి… చంపేసిన గ్రామస్తులు

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు మూర్తిన పట్టుకొని కొట్టారు. నిందితుడిని చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. అంతేకాదు నిందితుడికి నిప్పు పెట్టారు. ఈ మంటల్లో నిందితుడు మూర్తి కాలి సజీవ దహనమయ్యాడు. గురుమూర్తి వృద్ధురాలి నుంచి 4 వేల రూపాయలు కూడా దొంగిలించినట్లు తెలుస్తోంది.

అత్యాచారం చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్దురాలిని స్థానికులు పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అప్పిగానిపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురుమూర్తి వృద్ధురాలి నివాసంలోని చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు ఇంట్లోని రూ.4వేలు నగదుతో పాటు ఆమె ఆభరణాలు తీసుకుని పారిపోతుండగా స్థానికులు గుర్తించారు. గతంలో కూడా గురుమూర్తి ఇదే రకమైన పనులు రెండు మూడు చేసినట్లు తెలుస్తోంది. పనీపాటా లేక తిరుగుతున్నాడని ఆగ్రహించి ఊరుబయట చెట్టుకు కట్టేసి చితకబాది నిప్పుపెట్టారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement