Thursday, April 25, 2024

కారు – లారీ ఢీ… ఇద్దరి దుర్మరణం..

రేణిగుంట ( రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కధనం ప్రకారం హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్తున్న కారు మామండూరు వద్ద ఆగివున్న లారీ ని ఢీ కొన్నది. ఆ ప్రమాదం లో నగేష్ (47 ),శ్రావణ్ కుమార్ (25)
అనే ఇద్దరు అక్కడికి అక్కడే మరణించారు. ఆ ప్రమాదంలో గాయపడిన అపర్ణ, స్వాతి, సంజన,లక్ష్మి నారాయణ్, , రాధిక అనే ఐదుగురిని తిరుపతి రుయా ఆసుపత్రి కి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement