Monday, April 29, 2024

మొగిలి మాజీ చైర్మన్ వద్ద భారీగా మద్యం పట్టివేత

ఇద్దరు అరెస్ట్, వాహనాలు స్వాధీనం స్వాధీనం

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థాన మాజీ చైర్మన్ విజయ్ కుమార్ వద్ద ఎక్సైజ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.గురువారం చిత్తూరు రూరల్ ఎక్సైజ్ సీఐ తెలిపిన వివరాల మేరకు అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ ఇంచార్జి సిఐ, ఎస్ ఐ సూర్య ప్రకాష్,మోసెస్, హెడ్ కానిస్టేబుల్ ల బృందం తో సాధారణ తనిఖీల్లో భాగంగా యాదమరి మండలంలో తనిఖీలు పూర్తిచేసుకుని బంగారుపాలెం లో ని బెంగుళూరు రహదారి పక్కన ఉన్న 3/ 26 డోర్ నెంబర్ లో ఉన్న భవనాన్ని తనిఖీ చేయగా భారీ స్థాయిలో కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఆ భవనం లో ఉన్న మొగిలి దేవస్థానం మాజీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక వ్యాపారస్తుడు బాబు లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం , రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు .అనంతరం వారి వద్ద నుంచి ఒక కారు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement