Monday, April 29, 2024

ప‌న‌బాక గెలుపుతో ఎపికి మ‌రింత మేలు – ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్..

తిరుపతి: సుదీర్ఘ అనుభవం ఉన్న పనబాక లక్ష్మి ఎంపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేప‌థ్యంలో టిడిపి అభ్య‌ర్థికి మ‌ద్ద‌త్తుగా ఆయ‌న తిరుప‌తిలో ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 నుంచి పార్లమెంటులో ఎలా పోరాడుతున్నామో ప్రజలకు తెలుసునని అన్నారు. సభ్యుల సంఖ్య తక్కువ ఉండటంతో సమయం తక్కువ కేటాయిస్తున్నారని, ఇచ్చిన తక్కువ సమయంలో సమస్యలను ప్రస్తావిస్తున్నామని చెప్పారు. తాజాగా తిరుప‌తి నుంచి పనబాక గెలిస్తే తమతో పాటు పోరాటం చేస్తారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ఎంతో అభివృద్ది జరిగిందన్నారు. ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, రేణిగుంట సమీపంలో ఈఎంసీ అభివృద్ది చేశామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని విమర్శించారు. తిరుపతి నగరవాసులు తెలివైన వారు, విద్యాధికులని టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement