Wednesday, May 1, 2024

ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం కైగల్ బ్రిడ్జి వద్ద కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై శుక్రవారం కారును టాటా ఏసీ వాహనం ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన వీరంతా విరూపాక్షిపురంకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేఆర్‌పురంకు చెందిన మహిళ మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement