Tuesday, April 30, 2024

సైకిల్ ని ఢీకొన్న కారు -విద్యార్థి మృతి

తిరుపతి సిటీ .. ప్రభ న్యూస్.. పూతలపట్టు నాయుడుపేట 150 బైపాస్ రోడ్డు రాందాస్ కాలనీ చెందిన రఘునాథ్ రెడ్డి కుమారుడు సోహిత్ రెడ్డి 13 సంవత్సరాలు. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి సైకిల్ పై రోడ్డు దాటుతుండగా గరుడ ఇన్ హోటల్ దగ్గర రామచంద్రపురం నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న హోండా సిటీ కార్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుచానూరు ఎస్ ఐ. రామకృష్ణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement