Friday, May 17, 2024

వెమ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేటీఆర్

ఉమ్మడి మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్టును రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు భూమిపూజ చేశారు. ఇదిలా ఉండగా జహీరాబాద్ నియోజకవర్గంలోని
మామిడిగి, ఎల్గోయి, బర్దిపూర్, మెటలకుంట భూ నిర్వాసితులు పెద్దఎత్తున ఆందోళన దిగారు.

ర్యాలీగా కేటీఆర్ ప్రారంభించే వెమ్ పరిశ్రమ వద్దకు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. భూ నిర్వాసితులు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. భూ నిర్వాసితులను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement