Tuesday, April 30, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం..

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్థాన మండపం వరకు భక్తులు క్యూలో నిలుచున్నారు. వీరికి దర్శనం 15 గంటల వరకు అవుతుందని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నిన్న శ్రీవారిని 71,589 మంది భక్తులు దర్శించుకోగా 41,240 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.30 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement