Thursday, April 18, 2024

హైకోర్టులో – ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ఎదురుదెబ్బ‌

రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పిల్ వేశారు.మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ మనీ పేరుతో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించి… ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపి, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురాజు పిల్ వేశారు. ఏపీ మద్యం చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టాలను రద్దు చేయాలని తన పిటిషన్ లో రఘురాజు కోరారు. ఈ పిల్ ను విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రాకపోవడంతో… ఏ కారణాలతో పిల్ ను కొట్టివేసిందనే విషయం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement