Saturday, April 27, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు వ‌చ్చింది. శ్రీవారికి 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement