Thursday, May 2, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండుకోగా బయట క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 73, 016 మంది భక్తులు దర్శించుకోగా 37,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4,09 కోట్లు వచ్చిందని వివరించారు. ఈనెల 12 శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 17న ఆణివార ఆస్థానం వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement