Monday, April 29, 2024

రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసిపి నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తల చర్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి అన్న క్యాంటీన్ కు టీడీపీ అధినేత వచ్చారు. అన్న క్యాంటీన్ పై వైసీపీ నేతల దాడిని స్థానిక టీడీపీ నేతలు వివరించారు. వైసీపీ నేతల చర్యలకు నిరసనగా….అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement